విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 25వ తేదీన పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ఈనెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయానికి భక్తాదులు సహకరించినప్పుడే అభివృద్ధి బాటలో ఆర్టీసీ నడుస్తుందని తెలిపారు. ఈ అరుణాచలం గిరి ప్రదర్శన కాణిపాకం గోల్డెన్ టెంపుల్ కు రాను పోను చార్జీలు రూ.1,400 ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ముందస్తుగా భక్తాదులు ఆన్లైన్లో గాని బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని షీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. భగవంతుని సేవలో భక్తులు ఉంటే, భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు కూడా ఉంటుందని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 7382860947కు గాని 63002220650కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.