ఎంపీపీ అనూష దేవి
విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు తొలి మెట్టు అని స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ వసతి గృహ పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వైయస్సార్ టిఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తెడబారికి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అట్టలు, పెన్నలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవితో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పలాసి పండన్న, మోరి రవి, సురేష్ కుమార్ లతో కలసి విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివేందుకు పదవ తరగతి తొలి మెట్టు అని, పదవతరగతి చదువుతున్న విద్యార్థులు అత్యంత శ్రద్ధతో విద్యనభ్యసించడమే గాక రేపు జరగబోవు పబ్లిక్ పరీక్షలలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకొని పరీక్షలలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఆశించిన రీతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.