ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : రాబోవు శాసనసభ ఎన్నికల్లో అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని, ఇందుకుగాను ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి పేట్ ల పై రాజకీయ నాయకులు కూడా పూర్తిగా అవగాహన ఉండాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులతో సాధారణ ఎన్నికలు 2024 ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధివిధానాలపై పాటించాల్సిన పద్ధతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ అధికారులతో పాటించాల్సిన ఎన్నికల నియమ నిబంధనలు గూర్చి వారు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆర్డీవోనే స్వయంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ పనిచేసే విధానమును ప్రయోగాత్మకంగా చూపించారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అర్థవంతంగా అయ్యేవిధంగా పలుమార్లు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల సామాగ్రి పనిచేసే విధానంపై మాకు శిక్షణ ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, స్థానిక ఎమ్మార్వో రమేష్, డిఏఓ రమేష్ బాబు, నియోజకవర్గ ఎన్నికల ఉపతహసిల్దార్ షణ్ముఖ యాదవ్, వైఎస్సార్సీపీ పార్టీ, టిడిపి పార్టీ, బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీలు పాల్గొన్నాయి.