శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, అర్చకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ఈనెల 20వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు రానున్నారని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ, అర్చకులు, అభివృద్ధి కమిటీ వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ప్రసంగం ఉంటుందని, తదుపరి వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. అనంతరం అన్నదాన ప్రసాద సేవను స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎస్ వాలంటీర్స్, మాతృమండలి, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.