దత్త విజయానంద తీర్థ స్వామీజీ
విశాలాంధ్ర ధర్మవరం:: భక్తి భావాన్ని ప్రజలందరూ అలవర్చుకోవాలని దత్త విజయానంద తీర్థ స్వామీజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు రావడం జరిగింది. ఆలయ కమిటీ, అర్చకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తాదులతో కమిటీ వారితో అర్చకులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం దత్త విజయానంద తీర్థ స్వామీజీ మాట్లాడుతూ ప్రతి మనిషి నిస్వార్ధంగా ఉండాలని, ఉన్నదానితో కొంతవరకైనా సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, భక్తి భావాన్ని తప్పనిసరిగా పెంపొందించుకున్నప్పుడే మనిషి జీవితం సుఖవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎస్ వాలంటీర్స్ మాతృమండలి ఆలయ కమిటీ భక్తాదులు, పట్టణ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.