దేవాదాయ శాఖ జిల్లా అధికారి నరసింహ రాజు
విశాలాంధ్ర ధర్మవరం:: ఆలయ హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశలో కృషి చేస్తామని దేవాదాయ శాఖ జిల్లా అధికారి నరసింహారాజు, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు దుర్గమ్మ తల్లి ఆలయంలోనూ, పాండురంగ స్వామి ఆలయంలోనూ హుండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆలయం ద్వారా అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు 5 నెలలకు గాను ఏడు లక్షల 42 వేల 900 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పాండురంగ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపులో 49వేల 50 రూపాయలు రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ రామశాస్త్రి, గ్రామీణ బ్యాంకు సిబ్బంది, ప్రణవ సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.