శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని తొగటవీధిలోగల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణముందు ఈనెల 24వ తేదీ ఆదివారం రోజున నిర్వహించబడే 97వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కోశాధికారి, గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటేశులు ( చిట్టి) అధ్యక్ష, కార్యదర్శులు బివి. రమణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ళ అశ్వత్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. వృద్ధులు, పేద ప్రజలు విద్యార్థులు ఏ వయసులో వారైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా ఒక నెలకు సరిపడు మందులను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింతా లక్ష్మీనరసమ్మ, కీర్తిశేషులు చింతా రామకృష్ణా జ్ఞాపకార్థం వీరి కుమారులు చింతా వెంకట రంగయ్య అండ్ చింతా కృష్ణమూర్తి నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా ప్రముఖ వైద్యులైన డాక్టర్ వివేక్ కుల్లాయప్ప- దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు-చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సాయి స్వరూప్-జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జై దీపు నేత- గ్యాస్ట్రో అండ్ లాప్రోస్క్ సర్జన్) మంచి వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి కూడా తెలపడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.