విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామంలో అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా డాక్టర్ బాబూ జగజీవన్ రావ్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్మిక శాఖ, న్యాయ శాఖ, తంతి తపాలా శాఖ, వ్యవసాయ, రైల్వే శాఖ మంత్రిగా పలు ఉన్నత పదవులు అలంకరించిన స్వర్గీయ జగజ్జీవన్ రావ్ ఆదర్శప్రాయంగా ఉండేవారని వక్తలు తెలిపారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్త శ్రీనివాసరావు, సంఘం జిల్లా సీనియర్ నాయకులు కండెల్లి వెంకట్రావు మాస్టారు, యర్రవరపు పైడ్రాజు, యర్రవరపు నాగప్పరావు. యర్రవరపు లింగాలు, ఎర్రవరపు సూర్యనారాయణ, ఎత్తుల
వెంకట అప్పారావు, ఎర్రవరపు చందర్రావు, పెడమట్ల శివాజీ గణేష్, కోరుబల్లి ఏసేపు, ఎర్రవరపు నవీన్, ప్రకాష్, వర్ధన్, ఎత్తుల ప్రసాదు, మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని దివంగత నేత బాబూ జగజ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.