విశాలాంధ్ర-విజయనగరం : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 117వ జన్మదినం సంద్భంగా, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఇతర అధికారులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహా విద్యార్ధులు మాట్లాడుతూ, జగ్జీవన్ జాతికి చేసిన సేవలను శ్లాఘించి, జీవిత విశేషాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు, జెడ్పి సిఇఓ శ్రీధర్రాజా, ఎస్సి కార్పొరేషన్ ఇడి సుధారాణి, సాంఘిక సంక్షేమశాఖ డిడి రామానందం, సంక్షేమాధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్దులు పాల్గొన్నారు.