విశాలాంధ్ర ధర్మవరం=చలివేంద్రాల యొక్క సేవ ప్రజల దాహార్తిని తీరుస్తాయని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ధర్మవరం ఆర్టీసీ ఆవరణములో చలివేంద్రమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూఈ చలివేంద్రాన్ని దాతలు కీర్తిశేషులు గుండా నారాయణస్వామి జ్ఞాపకార్థం వారి కుమారుడు గూండా నాగరాజు సిద్ధి రాజేష్ సిల్క్స్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని యువర్ ఫౌండేషన్ కమిటీ తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో వేడి అధికంగా ఉన్నందున ఈ చరివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువర్ ఫౌండేషన్ సంస్థ వివిధ రూపాలలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతలను యువర్స్ ఫౌండేషన్ కమిటీ వారు ఘనంగా తదుపరి ఇటువంటి చలివేంద్ర కార్యక్రమం మా ఆర్టీసీ ఆవరణములో నిర్వహణ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని డిపో మేనేజర్ సత్యనారాయణ అనంతరం యువర్ ఫౌండేషన్ సంస్థకు దాతకు డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు గర్రె బాబు, సత్రశాల మల్లికార్జున, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.