అనంత అర్బన్ అభ్యర్థి సీ. జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : కరోనా సమయంలో వైద్యులు అందించిన వైద్య సేవలు అమోఘమని అనంత అర్బన్ సిపిఐ అభ్యర్థి సి.జాఫర్ పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇండియా కూటమి ఆధ్వర్యంలో భాగంగా సిపిఐ పార్టీ అనంత అర్బన్ అభ్యర్థి సి. జాఫర్ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్నటువంటి ఉన్నత వైద్యాధికారులను, మెడికల్ సిబ్బందిని కలసి కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా సమయంలో ముస్లిం, హిందూ స్వచ్ఛంద సంస్థలతో పాటు సిపిఐ పార్టీ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. రెండో దఫా కరోనాలో చాలామంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధితో మరణించడం జరిగిందన్నారు కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మూఢనమ్మకాలు తెలియజేస్తూ చప్పట్లు, దీపాలు, గోమూత్రం తాగండి అంటూ ప్రచారం చేయడం జరిగిందన్నారు. అప్పట్లో వైద్య వ్యవస్థ ప్రాణాలు తెగించి పని చేయడం వల్ల మరణాల సంఖ్య తగ్గిందన్నారు. మధ్యతరగతి సమస్యలపై పోరాడే సిపిఐ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనంత నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, సహాయ కార్యదర్శి అలిపిర, రమణ, మైనారిటీ సిపిఐ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు..