విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ లో నాట్య ఆచార్యులు బాబు బాలాజీ, కమలా బాలాజీ, రామ లాలిత్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బాబు బాలాజీ, కమలా బాలాజీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ లలిత నాట్య కళానికేతన్ వారు వందల మందికి కూచిపూడి, భరతనాట్యంను నేర్పించి భారతీయ సంస్కృతి కళలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయాలన్న లక్ష్యముతో తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. భారతీయ సాంప్రదాయ ఆచార వ్యవహారాలను కూడా అందరూ పాటించే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా తాము నిర్వహిస్తున్నామని, హిందూ సాంప్రదాయ ప్రాధాన్యతకు కూడా విశేష గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 40 మంది విద్యార్థులు చే పలు నాట్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాట్యం, నాట్య కళాకారులు, భారతీయ నాట్యాలు గూర్చి పిల్లలకు పూర్తి దశలో వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాట్య ప్రదర్శన పట్ల తల్లిదండ్రులు, వీక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది అని తెలిపారు.