Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కసాయి మూకలతో కిరాయి ప్రచారం ..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఎం, ప్రజా సంఘాలు విజ్ఞప్తి…

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా లోని ఎన్.డి.ఏ. కూటమి ఎం.పి. అభ్యర్థి సి.ఎం రమేష్ గెలుపు కోసం వేలాది మంది కసాయి మూకలను మోహరించి ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపి ని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి. వెంకన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన విడుదల చేసారు. దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఎన్నికలని దీని ప్రాదాన్యతను ప్రజలు గుర్తించాలని తెలిపారు. సిఎం రమేష్ లాంటి పారిశ్రామిక వేత్తలను వలస తీసుకువచ్చి అనకాపల్లి పార్లమెంట్ లో పోటి చేయించి, బిజెపి ఎలాగైనా గెలవడం కోసం కిరాయి మనుషులు పెట్టి ప్రచారం చేయించే విషసంస్కృతి జిల్లా లోని ఎర్పడుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా లోని ఐదువేల మంది కసాయి మూకలను దింపి, డబ్బు మద్యం పంపకానికి సిద్ధం చేయడం జరిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదామని తెలిపారు. ఇటువంటి వ్వక్తులను పార్లమెంటుకు పంపిస్తే తీవ్ర ప్రమాదం ఎర్పడుతుందని తెలిపారు. మోడీ మూడవ సారి గెలిస్తే భవిష్యత్ లో ఎన్నికలు ఉండవని రాజ్యంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారని రాజకీయ విశ్లేషకులు చేబుతున్నారని, దీ మ్న్ని ప్రజలు అర్థం చేసుకోని ఎన్.డి.ఎ కూటమిని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img