Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మతతత్వ బీజేపీని ఓడించండి

డేగా ప్రభాకర్‌ 

విశాలాంధ్ర ఏలూరు: పదేళ్లుగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజలకు ఏమీ చేయని ప్రధాని నరేంద్ర మోదీ… మతాల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు యత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ మండి పడ్డారు. మతతత్వ బీజేపీ, నియంతృత్వ మోదీని ఎన్నికల్లో చిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఏలూరు నగరంలోని కొత్తపేట, చోడి దిబ్బ, తంగళ్ళమూడి, ఆదివారం పేట, పెన్షన్‌ లైన్‌, గన్‌ బజారు తదితర ప్రాంతాలలో డేగా ప్రభాకర్‌్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి సీపీఐ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మోదీ ప్రధాని అయిన నాటినుంచి నేటి వరకు అవాస్తవాల ప్రచారంతో దేశ ప్రజలను మోసం చేయడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని , ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దేశంలో నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అమ్మేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా పట్టించుకోలేదన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పి… డబ్బు దోచుకున్న వాళ్లంతా బీజేపీకి చెందిన వాళ్లే కావడంతో చేతులెత్తేశారన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాజనాల రామమోహనరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల, ఉప్పులూరి లక్ష్మి, గొర్లి స్వాతి, గేదెల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ నుండి సుబ్బారావు, మూర్తి, సీపీఎం నాయకులు జగన్నాథం, మంచెల్ల ఇస్సాక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img