టీఎస్ ఎప్సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. టీఎస్ ఎప్సెట్ పరీక్షలు మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ వారికి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.