విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు(11 రోజులు) ఆలయ ఈవో వెంకటేశులు, ఉభయ దాతలు, అర్చకులు, రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులు ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల వేడుకల్లో 4వ రోజు శనివారం ఉదయం అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ ,చక్రధర్ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు. ఉభయ దాతలుగా ఊకా సత్యనారాయణ అండ్ సన్స్, బండారు శ్రీనివాసులు, దాసరి నిరంజన్ కుమార్ యాదవ్ అండ్ లలితా కుమారి అండ్ సన్స్, గాండ్ల రామాంజనేయులు అండ్ సన్స్, కీర్తిశేషులు గోనిపెంట చెల్లప్ప, వెంకట లక్ష్మమ్మ అండ్ సన్స్, దాశెట్టి నారాయణస్వామి అండ్ సన్స్-మాధవ సిల్క్ హౌస్, లక్ష్మీనరసమ్మ జల్లా చిన్న రామయ్య ల కుమారుడు జల్లా చంద్రశేఖర్, కీర్తిశేషులు కాచర్ల మునయ్య, కీర్తిశేషులు తులసమ్మ, బండి వేణుగోపాల్, బండి రాము కుమారుడు తేజ దీపక్, కీర్తిశేషులు బండి చిన్న సంజీవప్ప కుమారులు, మనవాళ్లు, బండి హనుమంతు, ఆంజనేయులు, రామకృష్ణ, శ్రీనివాసులు, హరినాథ్, సత్యనారాయణ, కీర్తిశేషులు బండి సూర్యనారాయణ భార్య ఈశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, హరి, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.