జిల్లా ఎస్పీ గౌతమిశాలి
విశాలాంధ్ర – అనంతపురం : సమస్యాత్మక గ్రామాలలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. రాప్తాడు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పోలీసు స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక గ్రామాలు, అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఇంకా ఎవర్నైనా బౌండోవర్ చేయాల్సి ఉంటే త్వరితగతిన పూర్తీ చేయాలని సూచించారు. క్రిటికల్ గ్రామాలను తరుచూ సందర్శించి సమస్యలు ఉత్పన్నం కాకుండా, గ్రామాలలో ప్రశాంతత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్ లు, గ్రామసభలు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల కౌంటింగు, ఆ తర్వాత కూడా గ్రామాల్లో హింసకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. రాప్తాడు, ఇటుకలపల్లి సి.ఐ లు మునిస్వామి, నరేంద్రరెడ్డిలు ఆయా పోలీసుస్టేషన్ల తనిఖీల్లో పాల్గొన్నారు.