విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.23.05.2024ది. ఈ ఏడాది పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తున్నది. విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్స్ కోసం పదవ తరగతిలో 90 శాతం మార్కులు ఉండాలి, ఇంటర్ మొదటి సంవత్సరంలో నమోదు చేసుకోవాలి. విద్యాదాన్ ఉపకార వేతనాలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7 వరకు సమయం వుందని అధికారులు తెలిపారు. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు రావాలి. ఉపకార వేతనం పొందాలంటే ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చును అని తెలియజేసారు. విద్యాదాన్ఏఎస్డి ఫౌండేషన్.కామ్ .