విశాలాంధ్ర – అనంతపురం : ప్రపంచ పర్యావరణ దినాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకోవడం జరుగుతోందని అడిషనల్.డి.యం.ఇ /సూపరింటెండెంట్ డాక్టర్.కే.యస్.యస్.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి అనే గ్రహాన్ని రక్షించడానికి మిలియన్ల మంది ప్రజలు నిమగ్నమై పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.
ఆరోగ్యం శరీరానికే కాదు పరిసరాలకు కూడా ఉండాలి. మన పరిసరాలు కలుషితం కాకుండా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతామన్నారు.
పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా మొక్కలను నాటడం, జల సంరక్షణలో, సురక్షిత జల సంరక్షణకు పాటుపడడం మన బాధ్యత కావాలని ఆశిస్తూ.. ప్రతి ఒక్కరూ పుట్టిన రోజున ఒక మొక్కను నాటితే ఈ పర్యావరణ దినోత్సవమునకు మంచి బహుమానం ఇచ్చినట్లు అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.యం.వో. డాక్టర్. పద్మజ,డాక్టర్. హేమలత , సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.