విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లా ఫిజికల్ సైన్స్ టీచింగ్ డైరీను జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ ఆవిష్కరించారు. ఫిజికల్ సైన్స్ డైరీ ని ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల ఫోరం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు సైన్స్ పై ఉండే భయాందోళన తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు.జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు రూపకల్పన చేసిన ఈడైరీ 240పేజీలతో విన్నుత్నంగా తయారు చేశారు. అన్ని అంశాలు డైరీలో పొందుపరిచారు..ఈకార్యక్రమం లోజిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పెంట రామకృష్ణ, ఏఎంఓ శ్రీనివాసరావు, ఏఎస్ ఓ రామకృష్ణ, ఏ పి ఓ హరిప్రసాద్, మన్యం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ సతీష్ రాజు, బెహరా సంతోష్, పెదప్రోలు శైలజ,తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.