Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రాష్ట్రమంత్రిగా సంధ్యారాణి ప్రమాణస్వీకారం….

విశాలాంధ్ర- సాలూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు…
సంధ్యారాణి 1974 మార్చి 15 వ తేదీన జన్మించారు.తండ్రి జన్ని ముత్యాలు(మాజీ ఎమ్మెల్యే) స్ఫూర్తితో 25 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.1999 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు.1999-2006 వరకు సాలూరు నియోజకవర్గ కాగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా కొనసాగారు.2005-07 మధ్య అంటే రెండేళ్ల పాటు ఉత్తరాంధ్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ కో ఆర్డినేటర్ గా పనిచేశారు.2007-09 మధ్యలో యస్సీ,యస్టీ కమీషన్ సభ్యరాలిగా పనిచేశారు.ఆ తరువాత తెదేపా లో చేరి 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సాలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధిగా ఎన్నికలబరిలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి రాజన్నదొర చేతిలో ఓటమిచెందారు.2009 నుండి 2014 వరకు సాలూరు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ గా పనిచేశారు.ఇంఛార్జ్ గా సంధ్యారాణి వ్యవహరించిన కాలంలో మున్సిపల్ ఎన్నికలలో సాలూరు మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకుంది.2014 సార్వత్రిక ఎన్నికలలో అరుకు పార్లమెంటు నియోజకవర్గం నుండి తెదేపా తరుపున పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు.2015-21 మధ్య కాలంలో శాసనమండలి సభ్యురాలిగా ( ఎమ్మెల్సీ)పనిచేశారు.2021 నుండి నేటివరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు.2024 లో జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్ధి గా ఎన్నికల బరిలో నిలిచి తమ సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్ధి రాజన్నదొర పై 13 వేల పై చిలుక ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.సంధ్యారాణి కి మంత్రి పదవి రావడంతో తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇరవై సంవత్సరాలగా నియోజకవర్గం లో నిర్జీవంగా ఉన్న తెదేపా పార్టీకి సంధ్యారాణి గెలుపుతో కొంత ఉత్సాహం వచ్చింది‌.ఇప్పుడు మంత్రివర్గంలో ఆమెకు స్థానం కేటాయించడంతో నియోజకవర్గంలో తెదేపాకు మంచి రోజులు వచ్చాయని కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు ‌…..

మంత్రి సంధ్యారాణి కి శుభాకాంక్షల వెల్లువ…. రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని బుధవారం మంత్రి గా ప్రమాణం స్వీకారం చేసిన గుమ్మిడి.సంధ్యారాణి కి సాలూరు నియోజకవర్గ తెదేపట నాయకులు అమరావతిలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.సాలూరు మండల తెదేపా అధ్యక్షుడు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో మండల నాయకులు కరిబుగత.భాస్కరరావు, ఎక్కుడు గణపతి,కృష్ణ తదితర నాయకులతో పాటు పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు పప్పల.మోహనరావు,కొణిసి.వేణుగోపాల్(చిన్ని)తదితరులు కలసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆముదాల.పరమేష్ మాట్లాడుతూ సంధ్యారాణి కి మంత్రి పదవి లభించడం వలన సాలూరు నియోజకవర్గం తో పాటు నూతనంగా ఏర్పాటు అయిన మన్యం జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.సంధ్యారాణి కి మంత్రి పదవితో సాలూరు లో తెదేపా గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్త కష్టానికి తగిన ఫలితం లభించిందన్నారు.పార్టీ అధినాయకుడు చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు…..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img