విశాలాంధ్ర, పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం ఎమ్మెల్యేగా 21వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన విజయ్ చంద్ర బోనెల శుక్రవారంనాడు అమరావతిలోని శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ చంద్ర బోనెల అనే నేను…..భగవంతుని సాక్షిగా తనకర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ప్రమాణస్వీకారం చేశారు . ప్రమాణ స్వీకారం చేసినఅనంతరం విజయ్ చంద్ర తాత్కాలిక స్పీకర్ కు, రాష్ట్రముఖ్యమంత్రికి, మంత్రులకు నమస్కారములు చేశారు. 16వశాసన సభకు మొదటిసారి ఎన్నికైన తాను నేడు శాసనసభలో అడుగుపెట్టడం ఎన్నటికీ మర్చిపోలేని అనుభూతన్నారు. ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కలిపించిన టీడీపి అదినేత చంద్రబాబు నాయుడుకు, ఉమ్మడి పార్టీలనేతలకు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లపుడూ రుణపడిఉంటానని చెప్పారు.16వ శాసనసభలో 59మంది తెలుగుదేశం పార్టీకీ చెందిన ఎంఎల్ఏలు కొత్తవారు కావడం గమనార్హం.జనసేన పార్టీలో 21మంది ఎంఎల్ఏలకు 14మంది కొత్తవారు కాగా, వైఎస్ఆర్సీపీ నుండి 11మందిలో 4గురు, బీజేపిలో 8మందిలో నలుగురు శాసనసభ్యులు కొత్తవారు కావడం గమనార్హం. దీంతోపాటు మంత్రివర్గంలోకూడా కొత్తవారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఉమ్మడిపార్టీలకూటమి (ఎన్ డి ఎ) పరిపాలనలో టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేనఅదినేత, ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ ల కాంబినేషన్ల ఆద్వర్యంలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమం,అభివృధ్ది, పరిపాలనపై అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 24న మొదటిసారి మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్న వేల ఇప్పటికే ఐదు హామీలపై సిఎం సంతకాలు చేయడంతో వాటిని అమలతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువ:
పార్వతీపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ చంద్రకు నియోజక వర్గంలోని మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మహిళలు, యువతీయువకులతో పాటు అధికారయంత్రాంగం అభినందనలు తెలియజేస్తున్నారు.పలువురు కీలక నాయకులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా తరలివెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో నియోజక వర్గంకు వచ్చే సమయంలో ఎంఎల్ఏ విజయ్ చంద్రకు ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నారు.