న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి.
విశాలాంధ్ర ధర్మవరం,:: లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని మండల న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి గీతా వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 29న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అదాలత్ కు పోలీసులు, న్యాయవాదులు, కచ్చిదారుల సహాయ సహకారములతోనే విజయవంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇటీవలే కోర్టు పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో గల సీఐ,ఎస్ఐ లతో లోక్ అదాలత్ పై అవగాహన చేస్తూ, విజయవంతం చేయుటలో తీసుకోవలసిన సలహాలు, సూచనలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ లోక్ అదాలత్ బ్యాంకు రుణాలు ,పెండింగ్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. రాజీ కాదగ్గ సివిల్ అండ్ క్రిమినల్ కేసులు, సారాయి కేసులు, ఎక్సైజ్ కేసులు, తదితర కేసులకు పరిష్కారం లభించబడునని తెలిపారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. రాజీమార్గమే రాజ మార్గమని తెలిపారు.