విశాలాంధ్ర -ధర్మవరం: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన దాతలు కంశల దేవేంద్ర ఆచారి, కుమారి అక్క, తమ్ముడు కలిసి పాఠశాల అభివృద్ధికి 30 వేల రూపాయల నగదును పాఠశాల హెచ్ఎం హనుమంతు రెడ్డికి అందజేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ పాఠశాలలో పలు సబ్జెక్టులకు ఉపాధ్యాయులు సరిపడి లేనందున, విద్యార్థులకు చదువుకు ఇబ్బందులు అవుతుందని తెలుసుకొని తాను ఈ నగదును వితరణ చేసినట్లు తెలిపారు. ఈ నగదుతో గ్రామంలోని చదువుకున్న వారితో చదువును విద్యార్థులకు బోధించి వారికి వేతన రూపంలో ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలోని తాగునీటికి ఇతర అవసరాల నిమిత్తం ఇంకా నాతోపాటు మరికొంతమంది వితరణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తదుపరి దాతలను గ్రామస్తులు హెడ్మాస్టర్ ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.