విశాలాంధ్ర విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ ఆదేశాలతో మంగళవారం వన్ టౌన్ పోలీసులు పట్టణంలోని ఎస్ ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్దులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల వినియోగం వలన విచక్షణ కోల్పోయి, మత్తులో హింసాత్మక సంఘటనలకు పాల్పడి, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారే అవకాశం ఉందన్నారు. మత్తు పదార్థాల అలవాటు పడితే భవిష్యత్తు నాశనమేనని అన్నారు. తల్లిదండ్రుల కళలను నిజం చేసేందుకు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని, శ్రద్ధగా చదివి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. భవిష్యత్తు నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరిబాబు నాయుడు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.