విశాలాంధ్ర సీతానగరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ మంగళవారంనాడు ఆకస్మిక సందర్శన చేశారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పించాలని, ‘డయేరియా’ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యా బోధనలో టీ ఎల్ ఎం ఉపయోగించాలని, డైరీలు, పాఠ్యప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన విద్యాకిట్లపై ఆరా తీశారు. ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేయాలని కోరారు. అడ్మిషన్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఇళ్ళా ప్రసన్న లక్ష్మి ,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.