విశాలాంధ్ర- విజయనగరం : విజయనగరం పట్టణం 31వార్డులో సోమవారం జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి నాయకులు లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి సచివాలయం ఉద్యోగుల ద్వారా పింఛనులను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు గోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భరోసా పేరిట 4000 పెన్షన్ ఇస్తూ పెంచిన సొమ్ము 3 నెలల మొత్తం కూడా కలిపి 7000 రూపాయల పింఛను అందజేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు హరిబాబు , భరత్ , బలరాం , బీజేపీ నాయకులు గోపాలకృష్ణ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.