విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పట్టణం లోని స్థానిక కస్పా పురపాలకోన్నత పాఠశాలలో చదివిన 2004 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ళు తర్వాత మళ్ళీ పాఠశాలలో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి చదువు నేర్పిన గురువులను పిలిచి వారిని ఉచిత రీతిన సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి విద్యాభ్యాసం సమయంలో వారి గురువులు తో పాఠశాలలో గడిపిన ఆనందమయా విషయాలను గుర్తుచేసుకున్నారు. అదే విధంగా గురువులు కూడా మాట్లాడుతూ 20 ఏళ్ళు తర్వాత తమని గుర్తు పెట్టుకొని ఇంతమంది పూర్వ విద్యార్థులు ఒక చోట చేరి సత్కరించటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. అప్పట్టి విద్యార్థులు కి ఇప్పటి విద్యార్థులుకి చాలా తేడా ఉంది అని విద్యార్థుల్లో గురువును గౌరవించాలి అనే సంస్కృతి తల్లిదండ్రులు పెంపొందించాలి అని తెలిపారు. ఇప్పటి విద్యార్థులు సోషల్ మిడియా మోజులో పడి వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు అని, కబ్బాట్టి తల్లిదండ్రులు పిల్లలు పట్ల ప్రేత్యేక శ్రద్ద కనబరిచినప్పుడే పిల్లలు ప్రయోజుకులు అవుతారు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అయిన నాయుడు, సన్యాసిరావు, బివి.గోపాల్ రావు, వంక రమణ, నాగేశ్వరి, కాంచన, మాధురి, నాగలక్ష్మి, గోపాల్ టీచర్లును పూర్వ విద్యార్థులు సత్కరించి ఆనందంగా గడిపారు