Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కోలాహలంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పర్వదినం

తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జ్ఞానేశ్వరి, సర్పంచ్ పుష్పలత, ఎంపీపీ అనూష దేవి, ఎంపీడీవో వీర సాయిబాబా

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పర్వదినం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ప్రకారం జూలై 1 నుంచి 3000 రూపాయల పెన్షన్ ను 4వేల రూపాయలకు పెంచి ఇస్తానన్న హామీ మేరకు సోమవారం పెంచిన 4 వేల రూపాయల పెన్షన్ తోపాటు అంతకుముందు మూడు నెలలకు కలిపి 3000 రూపాయలు వేసి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ ను సామాజిక లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా జూలై ఒకటో తారీకున తెదేపా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో వీర సాయిబాబా ప్రారంభించగా సచివాలయ సిబ్బందితో కలిసి అటు కూటమి పార్టీల నాయకులు ఒకవైపు, ఇటు వైకాపా ప్రజా ప్రతినిధులు మరోవైపు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీవో వీర సాయిబాబా తోపాటు కూటమి నాయకులు చల్లంగి జ్ఞానేశ్వరి, మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్, సీనియర్ నాయకులు పి బేతాళుడు, బేతా నూక రత్నం, నాగభూషణం, సోమేశ్, అచ్చియ్యలు, పెన్షన్ లబ్ధిదారుడు షేక్ మదీనా, స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీపీ కోరాబు అనూష దేవి, ఉప సర్పంచ్ నూరు బాబు, మండల కోఆప్షన్ సభ్యుడు నాజర్ వల్లి, వార్డు సభ్యురాలు ఎర్రం శెట్టి వెంకటేశ్వరమ్మ, వెల్ఫేర్ అసిస్టెంట్ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img