ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు విజయభారతి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- విద్యాసంస్థల బంద్ కారణంగా వాయిదా పడిన సప్లిమెంటరీ ద్వితీయ సెమ్ డిగ్రీ పరీక్షలు ఈ నెల 11 నిర్వహించనున్నట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యురాలు ఎం విజయ భారతి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 4న జరగవలసిన డిగ్రీ కళాశాల ద్వితీయ సెమ్ సప్లిమెంటరీ పరిక్షలు బిఎస్సీకి సంబంధించి పిజీక్స్, జూవాలజీ, బిఏ కి సంబంధించి ట్రావేల్ మెనేజ్మెంట్, టూరిజం, బికాం కు సంబంధించి బిజినేస్ ఎకనామిక్స్ పరిక్షలను నాలుగున విద్యాసంస్థలు తలపెట్టిన బంద్ కారణంగా వాయిదా చేయడం జరిగిందని, ఆ పరీక్షలను ఈనెల 11 వ తేదీన నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతో కళాశాల అధ్యాపకురాలు లీలా పావని పాల్గొన్నారు.