ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడమే ఎన్ డి ఏ యొక్క లక్ష్యము అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 22వ వార్డులో మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల ను పంపిణీ చేశారు. అంతేకాకుండా వార్డుల నుండి ప్రజల ద్వారా అర్జీలను కూడా స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.