జిల్లా బలేరియా అధికారి డాక్టర్ కుళ్లాయప్ప నాయక్
విశాలాంధ్ర-ధర్మవరం : సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కుళ్లాయప్ప నాయక్, సహాయక మలేరియా అధికారి లక్ష్మీ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ఓబుల నాయన పల్లి తాండ గ్రామాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి అక్కడి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి లార్వా బ్రీడింగ్ పాయింట్స్ గుర్తించి వాటిని తొలగించడం జరిగిందన్నారు. అలాగే దర్శనమల వైద్యాధికారిని పుష్పలత ఆధ్వర్యంలో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని, గ్రామంలో జ్వరం కేసులను గుర్తించి, వారికి రక్తపూతలు తీసి వాటిని పిహెచ్సి ల్యాబ్ కు పంపడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగాహన కల్పిస్తూ, వర్షాకాలంలో డయేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా పసలుకోవాలని తెలపడం జరిగిందన్నరు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్, సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ,ఏఎన్ఎం శివలక్ష్మి, ఎమ్మెల్ హెచ్ పి భారతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.