Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఇల్లు లేని ఎలక్ట్రీషియన్ ప్లంబర్లకు ఇంటి పట్టా ఇవ్వండి

రాష్ట్ర బిజెపి నాయకులు అంబటి సతీష్ కుమార్

విశాలాంధ్ర – ధర్మవరం:: ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రాజకీయ పలుకుబడితో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ కు కేటాయించిన పట్టాలను రద్దుచేసి నిజమైన ఇల్లులేని ఎలక్ట్రీషియన్ ప్లంబర్లను గుర్తించి ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్ ద్వారా ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు అంబటి సతీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జ్ హిందూపూర్ పార్లమెంటు నాయకులు బాలకృష్ణ యాదవ్ ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని సర్వేనెంబర్ 650-2 లో 75 మందికి ఫ్లాట్ ఇవ్వడం జరిగిందని అది పేరుకు మాత్రమే ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ అనే పేరు పెట్టి రాజకీయ ఒత్తిడితో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకుల మద్దతుదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ పట్టాలలో చాలా కొద్ది మంది ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్లు ఉన్నారని ఈ పట్టాలని రద్దుచేసి గిల్లులేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించి న్యాయం చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా సర్వేనెంబర్ 651-2 రెండు ఎకరాల 1989 లో నారాయణస్వామి ఓబుళపతి, చాకలి వీరమ్మ మరికొందరు దాన్ని కొనుగోలు చేయడం జరిగిందని రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ అంతకు పూర్వం ఇళ్ల పట్టాల ల్యాండ్ అక్విటేషన్ ద్వారా ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం వారు కొనుగోలు చేస్తున్నామని వారికి కాన్ఫిన్సేషన్ డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు కానీ భూ యజమానులు ఆ డబ్బులు తీసుకోకుండా కోర్టుకు పోవడం ఇంతవరకు వారు ఆ పారితోషకం కూడా తీసుకోకుండా ఉన్నారని భూ యజమానులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు అని, కాబట్టి రాజకీయ ప్రోత్బలంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఆక్రమించుకోవడం జరిగిందని తెలిపారు. భూ యజమానుల కోరిక మేరకు రెండు ఎకరాల స్థలాన్ని సర్వే చేయించి వాటిని ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్కు కేటాయించిన స్థలం కాకుండా మిగిలిన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించిన వారిని తొలగించి వారికి ఇప్పించవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ త్వరగా విచారణ చేపట్టి న్యాయం చేస్తానని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img