–ప్రజా సంక్షేమ పాలనకు వంద రోజులు
–ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆలూరు తాలూకా టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోనే ముత్తుకూరు గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణములో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి కూటమి పాలనలో సిఎం చంద్రబాబు ఈ వంద రోజుల్లో పలు సంక్షేమ పథకాలతో ప్రజల చేత ‘ఇది మంచి ప్రభుత్వం’ అని అనిపించుకుంటుందని అన్నారు. అవ్వాతాతలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్లు’, యువత భవిష్యత్కు మెగా డిఎస్సి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు, వరద బాధితులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజా సంక్షేమ పాలనకు వంద రోజులని పేర్కొన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పోస్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి ఆలూరు టిడిపి మండల కన్వీనర్లు పరమారెడ్డి, అశోక్, మండల కార్యదర్శి శేషాద్రి నాయుడు, సర్పంచ్ తోజోజప్ప, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, హరి, మాజీ ఎంపీపీ రత్నమ్మ భర్త మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, నర్సిరెడ్డి, గోవిందు, సంజప్ప, యూత్ నాయకులు సతీష్ కుమార్, జనసేన మండల కన్వీనర్ అరవింద్, బిజెపి నాయకులు రంగస్వామి, తాసిల్దార్ శివ శంకర్ నాయక్, ఎంపీడీఓ రాణేమ్మ, పంచాయతీ కార్యదర్శి జంప్లా నాయక్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.