విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు స్వయంగా మండలంలోని లక్కవరం, గవరవరం గ్రామాల్లో మంగళవారం వేకువ జామునే ప్రభుత్వ ఫించన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులైన బి.నాగరాజు, పల్లి సన్యాసినాయుడు, బి.పల్లవి తదితరులకు రూ.15,000లు చొప్పున ఫించన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక రోగులకు ప్రభుత్వ ఫించన్ ఓ వరంలా ఉపయోగపడాలి అన్నారు. ఫించన్లు కోసం కోసం ఎదురుచూపులతో నిరాశ చెందకూడదని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎం.పి.డి.ఓ ఆంజనేయులు, వీఆర్వో, సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్ శీరంరెడ్డి వెంకటరమణ (శ్రీను), మాజీ జెడ్పీటీసీ కనిశెట్టి మత్స్య రాజు తదితరులు పాల్గొన్నారు.