రెండు గంటలసేపు రాకపోకలకు అంతరయం
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – చింతపల్లి – నర్సీపట్నం ప్రధాన రహదారి లంబసింగి కొండ రహదారి (ఘాట్ రోడ్) లో భారీ లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం చింతపల్లి ప్రాంతం నుంచి హుబ్లీహిల్స్ (యూకలిప్టస్) కర్రల లోడుతో మన్య ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి వెళుతున్న లారీ ప్రమాదకర మలుపు వద్ద కటింగ్ అవ్వకపోవడంతో రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో చింతపల్లి- నర్సీపట్నం మధ్య రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా నిలిచిపోయిన భారీ లారీ సమాచారం తెలుసుకున్న పోలీసులు తమ సిబ్బందితో కలిసి సంఘటన ప్రాంతానికి చేరుకొని కర్రల లోడుతో ఉన్న లారీని రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పక్కకు తీయడంతో వాహనాల రాక పోకలు యధావిధిగా సాగాయి.