Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉచిత ఇసుక విధానంతో ప్రతి ఒక్కరికి మేలు

తెదేపా మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, లక్ష్మణ్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే ఇసుకను కూడా ఉచితంగా అందించే ఏకైక నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ అరకు పార్లమెంటు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ లతో కలిసి బుధవారం వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. గడచిన ఐదేళ్లు వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పరిపాలన సాగించిందన్నారు. ఇసుక లభించకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారన్నారు. ఇసుకను సైతం కొనుక్కోవలసిన దుస్థితి కల్పించిన ప్రభుత్వం వైకాపా అన్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి మేలు చేశామని చెప్పుకునే వైకాపా ఆ వాలంటీర్ లనే నమ్మించి నట్టేట ముంచారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అన్ని సాధ్యమని నమ్మిన పార్టీ వైకాపా అని, అనుభవం ఉంటే వాలంటీర్ వ్యవస్థ లేకుండా సర్వం సాధ్యమని నిరూపించిన ప్రభుత్వం తెదేపా అన్నారు. గడచిన ఐదేళ్లపాటు సంక్షేమం ముసుగులో సర్వం దోచుకున్న వైకాపాకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వేగవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ తో పాటు పలు హామీలపై తొలి సంతకాలు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. అదే క్రమంలో నేడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి చరిత్రలో నిలిచారని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img