మండల ఈవోపీఆర్డి శ్రీనివాసరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – వారపు సంతల ఆశీలు పాటలు పాడిన వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక ఈవోపీఆర్డి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చింతపల్లి, లంబసింగి, లోతుగడ్డ జంక్షన్, అన్నవరం గ్రామాలలో నిర్వహిస్తున్న వారపు సంతలకు సంబంధించి ఆశీలు పాటలు నిర్వహించారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి చిందాడ అప్పారావు 3 లక్షల 10 వేలు, పెదబరడ గెమ్మేలి కృష్ణ 1లక్ష 53 వెలు, అన్నవరం చల్లంగి కొండలరావు 80 వేలు, లంబసింగి లాకరి వెంకట్రావు 96 వేలు చొప్పున ఆశీలు పాట లో నెగ్గారు. ఆశీలు పాటలను కేజీకించుకున్న గుత్తేదారులు 2024-2025 సంవత్సరంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఆశీలు పాటలు పూర్తి వివరాలు అల్లూరి జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి పూర్తి సమాచారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశీల పాటలను చేజిక్కించుకున్న వారు పాల్గొన్నారు.