లబోదిబో మంటున్న లబ్ధిదారులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరిచారని లబ్ధిదారులు
గోపినాయక భవాని, గులిమిందల అజంత కుమారి, పల్టాసింగి, చంద్రకళ, గోపినాయక సునీల్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు అందించిన వివరాల ప్రకారం మండలం లోని కొత్తపాలెం పంచాయతీ కడశిల్ప గ్రామంలో వైకాపా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరిచిందన్నారు. ఈ విషయమై ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కనీసం నూతనంగా ఏర్పడిన తెదేపా ప్రభుత్వంలో అయినా తమ గోడు విని వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు కోరుతున్నారు.