Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వైకాపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

జోరుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం

జడ్పిటిసి సభ్యుడు బాలయ్య

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని మరో మారు అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జోరుగా ప్రచారం నిర్వహించాలని జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. మే నెలలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల ప్రచారం మన్యంలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో మండలంలోని కొత్తపాలెం పంచాయతీ జున్నుల, తీగల మెట్ట, పెదపాకలు గ్రామాలలో ఆ పార్టీ సచివాలయ కన్వీనర్ వనగల బెన్నిబాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువు తీరడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఈ క్రమంలో పాడేరు అభ్యర్థి మధ్య రాస విశ్వేశ్వర రాజు అరకు ఎంపీ అభ్యర్థి తనుజారాణి లను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాలు నిర్వహించడమే గాక, ప్రతి ఒక్కరూ ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసేటట్లు కృషి చేయాలన్నారు. యువ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ పంచాయతీ ఎంపీటీసీ సభ్యురాలు ఎం రాజులమ్మ, మాజీ వైస్ ఎంపీపీ భూసరి కృష్ణారావు, వైసిపి సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, మాజీ సర్పంచ్ కిట్లంగి రాంబాబు, పాంగి మోహన్ రావు, కేపరి రాంబాబు, కిట్లంగి కృష్ణ, లకే సింహాచలం, గణేష్, దొండ నాగరాజు, చిట్టపులి చిరంజీవిపడాల్, బోరుబోజి కొండబాబు, భీమరాజు, దాస్,రంగారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img