విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.22.06.2024ది. చోడవరం శ్రీ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ( ట్రస్ట్) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజును ఆదివారం స్థానిక గణేష్ గాయత్రి భవనంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు
చేసినట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కందర్ప కృష్ణ మూర్తి (కిష్టప్ప) శనివారం మీడియా కు తెలిపారు. ప్రస్తుత పాలకులు, గౌరవ శాసనసభ్యులు కె.ఎస్.ఎన్.రాజు అభినందన సభకు నియోజక వర్గంలోని గౌరవ బ్రాహ్మణ పెద్దలు, బంధువులు, గాయత్రీ, వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు, సభ్యులు విధిగా హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మన బ్రాహ్మణ సంఘం తరఫున ఏర్పాటు చేసిన అభినందన సభకు బ్రాహ్మణులు అందరూ ఆహ్వానితులే అన్నారు. కావున మన బ్రాహ్మణ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ తప్పనిసరిగా విచ్చేసి, ప్రస్తుత పాలకులకు అభినందనలు, వేద ఆశీర్వచనములు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు.