డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వి సల్మాన్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన” ఈ ఆశ యాప్ కు” సంబంధించిన ప్రతి అంశాన్ని ఆశా కార్యకర్తలు పర్యవేక్షణ చేసిన తర్వాత వాటి ప్రగతి వివారాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వి సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవో హోంలో శుక్రవారం ఆశా కార్యకర్తలకు ఈ ఆశా యాప్ పై అవగాహన తరగతులను నిర్వహించారు. అనంతరం డాక్టర్ సెల్ఫీ సల్మాన్ మాట్లాడుతూ ఈ యాప్ లో గర్భవతుల నమోదు ప్రసవములు వ్యాధి నిరోధక టీకాలు మొదలగు కార్యక్రమాల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. తదుపరి జిల్లా డి ఎల్ ఏ టి ఆఫీసర్ డాక్టర్ తిప్పయ్య నాయక్ మాట్లాడుతూ కుష్టి వ్యాధి నివారణకై ప్రతి ఒక్క ఆశా కార్యకర్త ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు రోజుకు 25 గృహాలను సందర్శించి, శరీరంపై ఉన్న రాగి రంగు మచ్చలకు స్పర్శ లేని మచ్చలను గుర్తించి, వెంటనే మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో ఉంచాలని తెలిపారు. తద్వారా ప్రాథమిక స్థాయిలోనే వారిని గుర్తించి కుష్టి వ్యాధి నివారణ చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిపి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, ఎంవో అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, టీబి సూపర్వైజర్ రహమత్ భాష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లైన సాయి నగర్, దుర్గా నగర్, శివానగర్, ఎల్సికేపురం, కొత్తపేట లలోని మెడికల్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.