విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం లో రజక వృత్తుదారుల ఆరాధ దైవం చాకలి ఐలమ్మ కాలనీలో గంగమ్మ జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ చేతి వృత్తుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో పది సంవత్సరాలకు ఒకసారి గంగమ్మ ను బోనాలతో ప్రదర్శనగా వెళ్లి పూజలు చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలు సమృద్ధిగా వచ్చి పాడిపంటలు , రైతన్నలు సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, ఉపాధ్యక్షుడు సి .నాగప్ప, భూసణ, ఆదినారాయణ, సంజీవులు మారుతీ, సురేష్ ,రామప్ప పాల్గొన్నారు.