పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన
విశాలాంధ్ర – ధర్మవరం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మోసం చేశార ని, అభివృద్ధి శూన్యము అని పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన తెలిపారు. ఈ సందర్భంగా వారు కొత్తపేటలోని 38వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గూర్చి ప్రజలకు వివరించారు. ఆ పథకం యొక్క లబ్ది యొక్క వివరణ కూడా ఇస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అనంతరం జ్ఞాన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసిందని వారు మండిపడ్డారు. టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు ముత్తుకూరు బీబి, మాదన మహేశ్వరి, భీమనేని గీతా వాణి, స్వర్ణకుమారి, మున్ని, బాలు నాగరత్న, శారద, సునంద, మీనాక్షమ్మ, మాలతి ,వహీదా, సమీం తదితరులు పాల్గొన్నారు.