బిజెపి నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం : ఓటర్ సర్వే విచారణ సక్రమంగా నిర్వహించి, ఓటర్లకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఆర్డిఓ తిప్పే నాయకులకు బిజెపి నాయకులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షులు డిష్ రాజు, ప్రధాన కార్యదర్శులు రాప్తాటి రాము, దుస్సా కృష్ణ లు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని 50 శాతము కూడా పని జరగలేదని, సర్వర్లు పనిచేయడం లేదని, మాకు ఇంకో పని అప్ప చెప్పారని, బి ఎల్ వో లు. ఇలాంటి కారణాలతో ఫీల్డ్ వరకు సరిగా జరగలేకపోవడం సరికాదని తెలిపారు. ఓటర్ల సర్వే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలను వేగవంతం చేయాలని కోరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లను గుర్తించి సమాచారం అందించినప్పటికీ, వాటిని తొలగించకుండా ఆ ఓట్లను నేడు కూడా కొనసాగించడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. అధికార పార్టీ నాయకుల వర్తిల్లతో ప్రతిపక్షాల నాయకుల కార్యకర్తల ఓట్ల తొలగించే లక్ష్యంగా వారు పనిచేస్తున్నట్లు మా దగ్గర పక్కా సమాచారం ఉందని వారు తెలిపారు. ఇప్పటికైనా అర్హత గల ఓట్లను తొలగించకుండా న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యాలయ ఇన్చార్జ్ గంధమనేని నారాయణస్వామి, సీనియర్ నాయకులు నిరంజన్ కుమార్ యాదవ్, అంజి, తదితరులు పాల్గొన్నారు.