విశాలాంధ్ర – శెట్టూరు : మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు బోరు ఎంచుకోవాలంటే రైతులు ఆందోళనకి గురవుతున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మహాదేవ్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలో డిప్యూటీ తాహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి డిమాండ్ తో కొన్ని వినతిపత్రం అందజేశాడు ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకు నిలయంగా మారిందని ఈ సంవత్సరం కూడా అతి తక్కువ వర్షపాతం నమోదయింది ఈ క్రమంలో రైతుల అప్పులు చేసి బోర్లు వేసుకుంటున్నారు. గతంలో ఒకడగు 95 రూ. ఇప్పుడు 105 రూ. తీసుకుంటున్నారు. ఇది కూడా కేవలం కల్యాణదుర్గం ప్రాంతంలో కొంతమంది బోరు ఓనర్లు డీజిల్ ధరలు పెరగకపోయినా రైతుల దగ్గర నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఆవేదన చెందారు అదనంగా డబ్బులు ఇవ్వని ఎడల బోరు వేయకుండా పూర్తిగా పనులు ఆపేస్తున్నారు.కావున దీని మీద తగు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాల్సినదిగా కోరారు ఈ కార్యక్రమం లో రైతులు శెట్టూరు మండల కార్యదర్శి జయరాములు సిఎం వన్నురప్ప, బొమ్మయ్య,అశోక్ తదితరులు పాల్గొన్నారు.