విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణం నందు మంగళవారం అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు మరియు బాధిత కుటుంబాల వారు కలిసి రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు పట్టణమునందు గత 23 రోజుల క్రితం సఫీహా 4 సంవత్సరాలు మిస్సింగ్ అయ్యి ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదని దీనిమీద పోలీసులు శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు బంధువులు రోడ్డుపై నిరసన తెలిపారు మా పాపను వెతికి పెట్టాలని23 రోజుల నుంచి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయేసరికి మా యొక్క బాధను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ విషయమై కియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ పెనుకొండ హెడ్ కానిస్టేబుల్ బాధితులకు నచ్చజెప్పి పాపను వెతికి తీసుకురావడానికి మా విశ్వ ప్రయత్నం చేస్తామని సిఐ గారితో డి.ఎస్.పి గారితో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు