విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం ఉదయం ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాతను శాకాంబరి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శర్మలు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి, భక్తాదులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాసవి మాత యొక్క జీవిత చరిత్రను కూడా భక్తులకు తెలియజేశారు. ఈ శాఖంబరి అలంకరణ కార్యక్రమం వాసవి మహిళా మండలి అధ్యక్షులు పోలమడ రూప రాగిని, కార్యదర్శి కాకుమాని కళ్యాణి, ఉపాధ్యక్షులు వాణి, శోభా దేవి, మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి అధ్యక్షులు పూలమడ రూప రాగిణి మాట్లాడుతూ సకల మానవాళి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, సకాలంలో వర్షాలు కురిసి, రైతులందరూ అధిక దిగుబడులను సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. తొమ్మిది రకాల పండ్లు, 16 రకాల కూరగాయలు, ఆకుకూరలతో కలిసి మొత్తం 350 కేజీలతో ఈ శాఖంబరి అలంకరణను చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆర్యవైశ్య మహిళలు వాసవి పారాయణం, సంకీర్తనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వాసవి మహిళా మండలి యొక్క దాతల ద్వారానే ఈ శాఖంబరి కార్యక్రమం విజయవంతం చేశామని తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రశాంతి వీణ విజయతోపాటు అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.