విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా గురువారం రాత్రి ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. సిసి టీవీలు పనిచేస్తున్నాయా అంటూ జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట బందోబస్తు నిత్యం కొనసాగాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ జి.వెంకటేష్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎలక్షన్ సెల్ సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, తదితరులు పాల్గొన్నారు.