ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సతీమణి సుప్రియ
విశాలాంధ్ర -ధర్మవరం : దానము అనే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సతీమణి సుప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ లోని బచ్చు నాగంపల్లి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఈనెల 8వ తేదీన జరగబోవు కళ్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమానికి తన వంతుగా ఒక లక్ష రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ వారికి ఎమ్మెల్యే సతీమణి సుప్రియ నగదును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని, అనంతరం ప్రతి ఆలయానికి, ప్రతి మనిషి తనకున్న దానిలో సేవా గుణాన్ని అలవర్చుకొని నగదు దానం చేయాలని తెలిపారు. దైవ ఆశీస్సులు లేనిదే ఏ కార్యము కూడా సిద్ధం కాదని తెలిపారు. మానవ ప్రయత్నంతో పాటు దైవ ఆశీస్సులు కూడా ఎంతో అవసరమని తెలిపారు. అందుకే ఏ దేశంలో లేని వివిధ దేవుళ్ళ ఆలయాలు మన దేశంలో ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఆలయాల ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. అనంతరం ఆలయ రథోత్సవ కమిటీ నిర్వాహకులు, వేముల జయరాం రెడ్డి, ఉ క్కిసిల గోవిందు… సుప్రియ కు కృతజ్ఞతలను తెలియజేశారు.